మునుగోడు ఉప ఎన్నిక ‘వీధుల్లో కుక్కుల కోట్లాట’ – వైఎస్ షర్మిల

-

మునుగోడు ఉప ఎన్నిక ‘వీధుల్లో కుక్కుల కోట్లాట’ అంటూ వైఎస్‌ షర్మిల వివాదస్పద ట్వీట్‌ చేశారు. ఒక్క నియోజకవర్గం కోసం 118 నియోజకవర్గాలు గాలికొదిలి ఎమ్మెల్యేలు, మంత్రులంతా మునుగోడుపై పడ్డరని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ తన కూతురును కాపాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నడు. ప్రజల గురించి పట్టించుకునే నాథుడే లేడని చురకలు అంటించారు.


YSR గారు రూ.450కోట్లతో నిజాంసాగర్ కాల్వలకు మరమ్మతులు చేయించి 3 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తే.. KCR ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. లెండి ప్రాజెక్టుకు YSR రూ.20కోట్లు కేటాయిస్తే.. KCR ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.జుక్కల్ నియోజకవర్గానికి KCR ఏం చేసినట్టు? అని నిలదీశారు వైఎస్‌ షర్మిల.

TDP నుంచి వచ్చిన జుక్కల్ MLA హానుమంతు.. నియోజకవర్గాన్ని గాలికొదిలి, ఒక్కో మండలాన్ని తన అనుచరులకు అప్పగించాడట అంటూ సెటైర్లు పేల్చారు. వారితో దందాలు చేయించి, వాటాలు తీసుకుంటాడట. ఇసుక మాఫియా కింగ్ అట. గూండాయిజానికి రాజు అట. ప్రశ్నిస్తే కేసులట.దాడులట. సిగ్గుండాలి కదా అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news