ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తా : షర్మిల

-

వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని, అక్కడి నుండి పాలేరుకు వెళ్లారు. పాలేరులో షర్మిల మాట్లాడుతూ.. పాలేరు ప్రజల సాక్షిగా… పాలేరు మట్టి సాక్షిగా… ఈ రాజశేఖరరెడ్డి బిడ్డ పాలేరుకు రాజశేఖరరెడ్డి గారి పాలనను అందిస్తానని మాట ఇచ్చిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పాలేరులో వైఎస్ 74వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభించి, ఇక్కడే ముగిస్తానని చెప్పారు.

రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలతో దివంగత ముఖ్యమంత్రి పాలనను తీసుకు వస్తానని చెప్పారు. నేను మళ్లీ చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు. రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాట ఇస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి ఇక్కడే ముగిస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news