మీరు మొనగాళ్లు అయితే కేంద్రంతో వరిని కొనుగోలు చేయించండి… కేసీఆర్ ధర్నాపై షర్మిళ సెటైర్..

-

ధాన్యం కొనుగోలుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తెలంగాణ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ చేపట్టిన ధర్నాపై  సెటైర్లు వేశారు. ’మూడు గంటలు ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్ధు చేయించామని జబ్బలు చరుచుకుంటున్న కేసీఆర్ గారూ… మీరు అంత మొనగాళ్లు అయితే 6 గంటలు ధర్నాచేసి రైతుల వడ్లన్నీ కొనేలా చేయ్యండి.. మంచి జరిగితే మీ అకౌంట్లో.. లేకుంటే పక్కోని మీద బట్ట కాల్చి మీద వేయడం మీకు అలవాటేగా‘ అంటూ సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఇచ్చినట్లు.. ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లు పెట్టారని.. రైతులను మసిపూసి మారేడు కాయ చేయాలని.. మోసాలు చేస్తే వదిలిపెట్టం, సెంటర్లు పెట్టడం కాదు, ముందుగా కాంటాలు పెట్టి రైతుల ధాన్యం వర్షం పాలు కాకముందే కొనుగోలు చేాయాని వైఎస్ షర్మిళ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news