రాబోయే రోజుల్లో 1200 ల TTD ఆలయాలు నిర్మిస్తాం – YV సుబ్బారెడ్డి

-

దళితుల ఉండే ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో 1200ల  TTD ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నామని.. విశాఖలో 35 కోట్లతో స్వామివారి ఆలయం నిర్మించామని పేర్కొన్నారు.

తిరుమలలో ఆలయ ప్రకారం, వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రకారం ఒక్కటేనని.. 31 కోట్లతో ఆలయం 2 సంవత్సరాల్లో నిర్మించామన్నారు. రాబోయే రోజుల్లో భక్తుల కోరిక మేరకు ఆలయాలు నిర్మిస్తామని..టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. జమ్ము కాశ్మీర్ లో త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 165 ఆలయల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. శ్రీ వారి ట్రస్ట్ ద్వారా 500 ఆలయాలు నిర్మించామని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్మిస్తామని వైవీ సుబ్బా రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్ఫష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news