కార్తీకదీపం ఎపిసోడ్ 1237: అడ్డొస్తే దీప, కార్తీక్ లను కూడా చంపేయమన్న రుద్రాణి..విషయం తెలిసి ఆవేశంగా రుద్రాణి ఇంటికివెళ్లిన డాక్టర్ బాబు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తున్న కార్తీక్ కి.. దీప స్నాక్స్ తీసుకొచ్చి ఆనందంగా తినమంటుంది. కార్తీక్ ఏంటి దీప ఉషారుగా ఉన్నావా అంటే.. రుద్రాణిని పోలీసులు అరెస్ట్ చేయడం సంతోషంగా ఉందని చెబుతుంది. కుక్కతోక వంకర అన్నట్టు అలాంటి వారు మారరు పైగా అరెస్టు చేయించారన్న కోపంతో మరింత రెచ్చిపోతారు, శ్రీవల్లి వాళ్లు పోలీసు కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశారు అని ఇప్పుడు అనిపిస్తుంది. దీప మాత్రం వాళ్లు చేసింది తప్పులేనట్లు మాట్లాడుతుంది. ఒక్కోసారి యుద్ధం కన్నా రాజీ ముఖ్యం కదా అన్న కార్తీక్.. మనం వెళ్లి రుద్రాణిని బతిమలాడి తీసుకొస్తే బాగుండేది అంటాడు. సరే అయిందేదో అయిపోయిందన్న దీప..రేపటి నుంచి వంటలు మొదలుపెడుతున్నా అంటుంది. అవునా ఏం పేరు పెడుతున్నావ్ అంటే.. మీ పేరే పెడతా అనడంతో.. నేను దురదృష్ట వంతుడిని వద్దు అంటాడు.

పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన రుద్రాణి.. వాళ్లు బిర్యాని తెచ్చాను రాక్కా తిందువు అంటే..మీరు తినండ్రా అని కుర్చీలో కుర్చుని జరిగింది ఆలోచించి..అమ్మోరికి బలిచ్చే టైమొచ్చిందిరా.. మనోళ్లందరకీ మేకపోతుల మాంసంతో భోజనం పెట్టాలంటుంది. ఎన్ని వేటలు బలివ్వాలని తన దగ్గరున్న రౌడీలు అడిగితే.. రెండు అని చెబితుంది. వాళ్లకు పనులు పురమాయిస్తుంది. అక్కా బలి రెండు అన్నావ్ తప్పదా అంటే…. అవసరమైతే అడ్డొస్తే వాళ్లిద్దరినీ కూడా అని చెబుతుంది.

బస్తీలో మోనిత

నరసమ్మ ఏంటి కాఫీ ఇవ్వలేదేంటి అని మోనితతో..అన్న మోనితతో.. మనకు పాలు, కూరగాయలు ఏవీ అమ్మడం లేదని చెబుతూ..మీరంటే ఎందుకంత కోపం అని అడుగుతుంది. మోనిత ఎక్పర్ట్ చేశా..కొత్తలో ఇలానే ఉంటుందిలే అంటుంది. నర్సమ్మా.. ఎందుకింత కోపం అని అడుగుతుంది. మోనిత మీది ఏ ఊరు అంటే..నర్సమ్మ గతంలో క్వశ్చన్ చేసిన ప్రియమణిని పంపించేశా అన్న మాటలు గుర్తుచేసుకుని ఎందుకులేమ్మా ఎంతదూరం అయినా వెళ్లి పాలు తీసుకొస్తా అంటుంది. ఆ తర్వాత కూల్ గా కూర్చున్న మోనిత… దీపక్కా నీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు.. అభిమానం ఎన్నిరోజులో నేను చూస్తా..దానికి ఎంతో టైం పట్టదు దీపక్కా..అసలు నేను వచ్చిందే..వీళ్లను మచ్చిక చేసుకుని..నీ ఆచూకి తెలుసుకోవడమే.. నాలుగు రోజులు టైం పట్టినా వీళ్లని నావైపు తిప్పుకుంటా అనుకుంటుంది. ఇల్లు కొన్నా, ఆసుపత్రి పెట్టా, త్వరలో బస్తీజనం అభిమానం కొనుక్కుంటా అంటూ కోటేష్ ఫొటో చూస్తుంది. ఫోన్లో కోటేష్ ఫొటో చూస్తూ..నా ఆనందరావుగారిని కిడ్నాప్ చేస్తావా-నీకు జీవితంలో ఆనందం ఉండదురోయ్ అంటుంది.

శ్రీవల్లి దీపను పిలిచి.. కాసేపు బాబుని చూడవా అక్కా గుడికి వెళ్లివస్తా అంటుంది. ఈ ఒక్క రోజు బాబుని చూసుకో అక్కా..రేపటి నుంచి మా పిన్ని వస్తానంది అంటుంది. బాబుని నేను చూసుకుంటా అని చెప్పిన దీప..దేవుడి హుండీలో వేసేందుకు డబ్బులిస్తుంది. పిల్లలు కూడా వచ్చి బాబుతో ఆడుకుంటారు.

సౌందర్య ఇంట్లో

పెద్దోడి గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని ఆదిత్యను సౌందర్య అడుగుతుంది. అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా మమ్మీ..ఫోన్ వాడకపోవడంతో ఎలాంటి ఆధారం దొరకలేదని, పోలీసులు చెప్పినదాని ప్రకారం అన్నయ్య వాళ్లు ఏదో మారుమూల పల్లెటూర్లో ఉండొచ్చన్నారని చెబుతాడు. ఆనంద్ రావు..పెద్దోడి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయి..కానీ కార్తీక్ తలొంచుకుని వెళ్లాడని ఎవ్వరూ అనుకోకుండా చూడాల్సిన బాధ్యత మనదే..కార్తీక్ అందరికీ దూరంగా వెళ్లాడు కానీ తప్పించుకుని వెళ్లలేదు.. ఈ విషయం అందరకీ అర్థం అయ్యేలా చెప్పే బాధ్యత నీదే ఆదిత్య అంటాడు.

మరోవైపు బాబుతో దీప కబుర్లు చెబుతూ..నువ్వు ఈ పెద్దమ్మతోనే ఉండిపో… వీపుపై పుట్టుమచ్చ ఉంటే గొప్పోళ్లవుతారు అంటారు.. నువ్వు నిజంగా గొప్పోడివే రుద్రాణి లాంటి రౌడీకే బుద్ధొచ్చేలా చేశావ్ అంటుంది. లేకపోతే.. నీ నామకరణానికే అడ్డుపడుతుందా ఆ రుద్రాణి అని నవ్వుతుంది దీప. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్.. ఆ రుద్రాణి రాత్రే ఇంటికి వచ్చేసిందంట దీపా అంటాడు. మరి ఇప్పుడు ఏం అవుతుంది అని దీప అంటే.. ఊళ్లో అందరూ ఆ రుద్రాణి.. కోటేశ్ ని వదలదు అనుకుంటున్నారు. పగబడితే వదలదంటూనే..కోటేశ్ వాళ్లకి ప్రమాదం పొంచి ఉందంటాడు.

స్కూటీపై శ్రీవల్లి- కోటేశ్

మన జీవితంలో మంచి రోజులొచ్చాయి.. మంచి బాబునిచ్చాడు, దీపక్కని ఇచ్చాడు అంటూ భర్త కోటేష్ తో మాట్లాడుతూ త్వరగా ఇంటికి పోనీవయ్యా అంటుంది శ్రీవల్లి. అబ్బులు గాడు లారీతో వీళ్ల స్కూటీ వెనుకే వస్తాడు.

మరోవైపు స్కూల్ కి వెళ్లిన దీప పిల్లలు మనం ఒక ఒప్పందం చేసుకున్నాం అని.. ఏం కావాలన్నా, ఏం నచ్చకపోయినా నాన్న ముందు మాట్లాడొద్దు, నన్ను మాత్రమే అడగండి అంటుంది. నాన్నను అడిగితే నాన్న దగ్గర డబ్బులు ఉండవు కదమ్మా..తను భాదపడతారు అంటుంది. పిల్లలు సరే అంటారు. మాకోసం ఏం తీసుకురాలేదమ్మా అంటే. వాళ్లకు ఏదో చాక్లెట్ ఇస్తుంది. ఇద్దరికీ చెప్పులు కొనిస్తుంది. వేసుకుంటారు. హిమ ఏ షోరూంలో కొన్నావ్ అని అడిగితే.. దార్లో తోపుడు బండిపై అమ్మితే కొన్నా అంటుంది. నేను పెద్ద షోరూంలో తెచ్చానని అబద్ధం చెప్పొచ్చు కానీ నేను అలా చెప్పను..మీరు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, వస్తువులు సౌకర్యంగా ఉండాలి కానీ వాటి ధర, ఎక్కడ కొన్నాం అనేదాన్ని బట్టి ఆనందం ముడిపడి ఉండకూడదు.. సంతోషం మనం పెట్టే ధరలో ఉండదు-చూసే దృష్టిలో ఉంటుంది అంటుంది. .

కట్ చేస్తే ఇంట్లో ఒంటరిగా కూర్చున్న కార్తీక్.. నువ్వు డాక్టర్ అనే విషయాన్ని మర్చిపోవాలని అంతా అన్న మాటలు, గతాన్ని గుర్తుచేసుకుంటాడు. నన్ను క్షమించు మమ్మీ..చెప్పకుండా ఎక్కడకు వెళ్తున్నానో దాచిపెట్టి మిమ్మలన్ని ఇబ్బంది పెట్టా అనుకుంటాడు ఎపిసోడ్ ముుగుస్తుoది.

రేపటి ఎపిసోడ్ లో

శ్రీవల్లి-కోటేశ్ ని చంపేందుకు కాపుకాసిన రుద్రాణి మనుషులు లారీతో బండిని గుద్దించేస్తారు. ఆ విషయం తెలిసిన డాక్టర్ బాబు ఆవేశంగా రుద్రాణి ఇంటికి వెళతాడు. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం అ‌వుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news