ఆంద్రప్రదేశ్ లో రైతులకు 12 అంకెల ఐడీ.. నెక్స్ట్ తెలంగాణలోనూ…!

-

కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి రైతులకు చేరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ ఆధారిత సేవలన్నీ అంతరాయం లేకుండా పొందేందుకు రైతుల కోసం ప్రభుత్వం ఒక 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను తీసుకు రానుంది. దేశవ్యాప్తంగా 5.5 కోట్ల రైతులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సేకరించడం జరిగింది. అలానే డిసెంబర్‌ నాటికి 8 కోట్లకు పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు.

farmersఇది ఇలా ఉంటే పీఎం కిసాన్‌ వంటి పథకాలను భూరికార్డులతో అనుసంధానించి ఒక సమగ్ర సమాచార వ్యవస్థను కూడా పెట్టాలనే ప్లాన్ లో వుంది. అయితే ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలను ఎటువంటి ఆటంకం లేకుండా పొందే వెసులుబాటు రైతులకు లభిస్తుంది. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించిన వాటి గురించి కూడా ఉపయోగ పడుతుంది. వ్యవసాయ మంత్రిత్వశాఖ అంతర్గతంగా దీనిని నిర్వహిస్తోంది.

ఆ డేటాబేస్‌లో 8 కోట్ల మంది రైతుల వివరాలు నమోదు కాగానే దాన్ని స్టార్ట్ చెయ్యాలని భావిస్తోంది. పీఎం కిసాన్‌, భూఆరోగ్య కార్డులు, పీఎం ఫసవల్‌ బీమా యోజన వంటి వాటి ఆధారంగా డేటాబేస్‌ చేసారు. అలానే ఏయే రాష్ట్రాలలో అయితే భూపటాల డిజిటలైజేషన్ జరిగిందో ఆ రాష్ట్రాల్లో జీఐఎస్‌ ఉపయోగిస్తారు.

భూములకు సంబంధించిన జీఐఎస్‌ డేటా ఉంటే రైతులు కచ్చితమైన సలహాలు పొందగలరని కేంద్ర ప్రభుత్వం అంది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఆంద్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు సంబంధించిన సమాచార వ్యవస్థ ఇప్పటికే రూపొందించారు. రానున్న రోజుల్లో తెలంగాణ, కేరళ, పంజాబ్‌ వంటి చోట్ల కూడా ఏర్పాటు చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news