ఇశ్రమ్ పోర్టల్ తీసుకువచ్చిన కేంద్రం.. ఉచితంగా రిజిస్టర్.. రైతులు చేరచ్చా..?

-

కేంద్రం ఎన్నో రకాల ప్రయోజనాలని కలిపిస్తోంది. అయితే ఆగస్ట్ నెలలో ఇశ్రమ్ పోర్టల్ ని కేంద్రం తీసుకు రావడం జరిగింది. ఈ వెబ్ సైట్ తో వర్కర్స్ రిజిస్టర్ చేసుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం ఇశ్రమ్ కార్డును ఇస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

farmers

8 కోట్లకు పైగా అసంఘటిత రంగంలోని కార్మికులు ఇప్పటి వరకు ఈ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఇందులో రైతులు చేరవచ్చా…? లేదా..? అనేది చూస్తే… ఇశ్రమ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చూస్తే కేవలం వ్యవసాయ రంగ కార్మికులు, పొలం లేని రైతులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు అని తెలుస్తోంది.

కనుక ఇశ్రమ్ వెబ్‌సైట్ ద్వారా రైతులు రిజిస్టర్ చేసుకోలేరు. రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన బెనిఫిట్ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రీమియాన్నితొలి ఏడాది కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ వస్తుంది.

ఇది ఇలా ఉంటే అసంఘటిత రంగ కార్మికులకు లభించే సామాజిక భద్రత ప్రయోజనాలు అన్నీ ఈ పోర్టల్ ద్వారానే చేరతాయి. తగిన సహాయక చర్యలు తీసుకుంటారు. అలానే వర్కర్లకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కచ్చితంగా అవసరం. అలాగే మొబైల్ నెంబర్‌ అనేది ఆధార్ కార్డుకు కచ్చితంగా లింక్ అవ్వాలి. ఇశ్రమ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news