పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..!

-

మీరు బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… నేడు బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది.

 

ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.410 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ.49,890కు తగ్గింది.

ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గుదల తో రూ.45,740కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర క్షీణించింది. 0.16 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1876 డాలర్లకు దిగొచ్చింది.

ఇక వెండి గురించి చూస్తే..వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. కేజీ వెండి ధర రూ.77,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో వెండి రేటు కూడా పడిపోయింది.

ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 28.01 డాలర్లకు దిగొచ్చింది. బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటివి పసిడి రేటుపై ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news