గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు

-

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ షెడ్యూల్ ప్రకారం.. సోమ వారం రాత్రి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అలాగే మంగ‌ళ వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై స‌మావేశం కావాల్సి ఉంది. కానీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో ప్ర‌స్తుతం రాజ్ భ‌వ‌న్ లోనే ఉంది. ఆక‌స్మ‌త్తుగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. అయితే త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ర‌ద్దు కావ‌డానికి కారణాలు తెలియాల్సి ఉంది.

కాగ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా ప‌రిణామాల‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు వివ‌రించ‌నుంద‌ని స‌మాచారం అందింది. గ‌త కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగింది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైని రాష్ట్ర ప్ర‌భుత్వం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చ‌ర్చింస్తార‌ని అనుకున్నారు. అయితే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జ‌ర‌గ‌నున్న భేటీ కూడా ర‌ద్దు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news