అదిరిపోయే స్కీమ్..ఒకసారి డబ్బులు కడితే ప్రతి నెల రూ. 20వేలు అకౌంట్లోకి..

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.కీలక ప్రకటనలు చేసింది. వీటిల్లో పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించి కూడా ముఖ్య ప్రతిపాదనలు ఉన్నాయి. దీని వల్ల ఆయా స్కీమ్స్‌లో డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ ను పెంచింది.ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఇకపై అధిక మొత్తాన్ని పొందే బెనిఫిట్ కూడా ఉంటుంది..

 

 

 

గతంలో రూ. 15 లక్షల వరకు డబ్బులు దాచుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇకపై ఈ లిమిట్ రూ. 30 లక్షలకు చేరుతుంది. అంటే సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ కింద రూ. 30 లక్షల వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.. దీని వల్ల వడ్డీ కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఇది ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇతర వాటి కన్నా ఈ పథకంలోనే అధిక వడ్డీ వస్తోంది. ఈ వడ్డీ రేట్లు అనేవి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కేంద్రం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను పెంచుతూ వస్తుంది.

ఇకపోతే మీరు ఎస్‌సీఎస్ఎస్ స్కీమ్‌లో రూ. 30 లక్షలు డిపాజిట్ చేశారని అనుకుంటే.. మీరు నెలకు రూ. 20 వేలు వడ్డీ రూపంలో లభిస్తాయి. మూడు నెలలకు రూ. 60 వేలు లభిస్తాయి. అదే ఏడాదికి అయితే రూ. 2,40,000 వస్తాయి. ఇక ఐదేళ్లలో మీరు వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా పొందొచ్చు.రూ. 5 లక్షలు పెడితే నెలకు రూ. 3333 వడ్డీ రూపంలో పొందొచ్చు. అంటే ఐదేళ్లలో రూ.2 లక్షలు వస్తాయి. ఇక రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు వడ్డీ రూపంలో ఐదేళ్లలో రూ. 4 లక్షలు లభిస్తాయి. నెలకు రూ. 6667 పొందొచ్చు.. అదే విధంగా రూ.25 లక్షలు పెడితే రూ.10 లక్షలు వడ్డీ పొందవచ్చు.. అంటే మనం పెట్టిన దానికి సగం వడ్డీగా పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news