రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!!

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.మోదీ ప్రభుత్వం జనపనార పండిస్తున్న రైతులకు మద్దతు ధరను ప్రకటించింది..రూ. 300 వరకు ధర పెరిగింది. దీంతో క్వింటాకు ముడి జనపనార ధర రూ. 5050కు చేరింది. 2023- 24 సీజన్‌కు సంబంధించి ఈ రేటు వర్తిస్తుందని గుర్తించుకోవాలి..

 

 

తాజాగా నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు..ఈ క్రమంలో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫార్సుల మేరకు కనసీ మద్దతు ధరను పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ముడి జనపనార కనీస మద్దతు ధర ఇప్పుడు క్వింటాకు రూ. 5050 గా నిర్ణయించారు..అదే విధంగా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) అలాగే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వపు నోడల్ ఏజెన్సీగా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటుంది. లాభనష్టాలను ఇది భరిస్తుంది. కేంద్రం ఈ నోడల్ ఏజెన్సీకి తోడ్పాటు అందిస్తుంది. కనీస మద్దతు ధర పెంపు వల్ల రైతులకు గతంలో కన్నా ఇకపై పంటకు ఎక్కువ రేటు వస్తుందని చెప్పుకోవచ్చు…

అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డి ఏ ను 4 శాతం పెంచిన సంగతి తెలిసిందే..తాజా పెంపుతో డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి చేరింది. ఇది వరకు డీఏ 38 శాతంగా ఉండేది. డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 12,800 కోట్లకు పైగా భారం పడనుంది. ఈ డీఏ పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. దీని వల్ల దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చివరిగా 2022 సెప్టెంబర్ నెలలో డీఏను పెంచింది. అప్పుడు డీఏ 4 శాతం పెరుగుదలతో 38 శాతానికి చేరింది. కాగా ప్రభుత్వం ఏటా డీఏను రెండు సార్లు సవరిస్తూ వస్తుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి డీఏ పెంపు ఉంటుంది.. ద్రవ్యోల్బనానికి తగ్గట్లు డిఏ సవరణ ఉంటుందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news