టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్టుతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష నేతలు అధికారపక్షంపై విరుచుకుపడుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వెంటనే తనకు అందుబాటులో ఉన్న నేతలతో మాట్లాడారు. అచ్చెన్నాయుడిని బలవంతంగా కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యతని చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా అసెంబ్లీలో ఉపనేతగా ఉన్న ఆయన్ను, విచారించాలని భావిస్తే, చట్టపరమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలే తప్ప, ఇలా రాత్రిపూట దాడులకు దిగడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే హోమ్ మంత్రి రాజీనామా చేయాలని, అచ్చెన్నాయుడు ఎక్కడున్నారో వెంటనే డీజీపీ మీడియాకు తెలియజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, ఈ తెల్లవారుజామున అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, ఆయన్ను విజయవాడకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
అచ్చెన్నాయుడు కిడ్నాప్ : చంద్రబాబు..!
-
Read more RELATEDRecommended to you
ఆంధ్ర ప్రదేశ్ లో అల్లర్లపై సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే!
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లు జరుగుతున్న...
Ganesh -
IPL 2024 : విజృంభించిన నికోలస్ పూరన్ .. భారీ స్కోరు చేసిన లక్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై...
Ganesh -
కాంగ్రెస్కు దేశం పట్ల పట్టింపు లేదు : ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష ఇండియా కూటమిపైతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు....
Ganesh -