టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఆయనపై కుట్రపూరితంగానే అభియోగం మోపారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఏసీబీ పూర్తిగా జగన్ డైరెక్షన్ లోనే పని చేస్తోందని టీడీపీ నేతలు పలువురు విమర్శించారు. కాగా , తాజాగా ఈ విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఎదుగుతున్న బీసీ నేతను చూసి ఓర్వలేక అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడి కుటుంబ నిబద్ధత, నిజాయితీ అందరికీ తెలుసన్నారు. బీసీ సంఘాలన్నీ ఇటువంటి దుర్మార్గాలను ఖండించాలని తెలిపారు. ఆరోపణలు, ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
జగన్ డైరెక్షన్ ఏసీబీ..!
-
Next article
Read more RELATEDRecommended to you
తెలంగాణకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది: జేపీ నడ్డా
కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని బీజేపీ జాతీయ...
కర్ణాటక సెక్స్ స్కాండల్.. ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి ఎలా వెళ్లగలిగాడు?: కేటీఆర్ ట్వీట్
సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న విదేశాలకు పారిపోవడంపై...
Nara Lokesh: రేపటి నుంచి యువగళం మళ్లీ ప్రారంభం
నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట 3132 కిలోమీటర్ల మేర...