బ్రేకింగ్ : మేయర్ బొంతు రామ్మోహన్‌పై కేసు..!

-

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌ కు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఆయన కారు డ్రైవర్ కు కరోనా రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పేల్చుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు మరో షాక్ తగిలింది. మేయర్ బొంతు రామ్మోహన్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన రూ.100 కోట్ల విలువ గల భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆయనపై కేసు దాఖలైంది. కోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆదేశాలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు చేప‌ట్ట‌రాద‌ని కోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news