భారత్ లో కరోనా అల్లకల్లోలం.. గడిచిన 24 గంటల్లోనే..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.

భారత్ లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 15,968 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 465 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,56,183 కు చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 14,476కు పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 2,58,684 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news