బిగ్ బ్రేకింగ్ : హైదరాబాద్ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్..!

-

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు పెరిగుతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎవరికీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. సీఎం, అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది దీని బారిన పడ్డారు. ప్రజలు, ప్రముఖులు, నాయకులు, అధికారులు.. ఇలా తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా..  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

కలెక్టర్ డ్రైవర్‌తో పాటు, కంప్యూటర్ ఆపరేటర్‌కు సైతం కరోనా నిర్ధారణ అయింది. శ్వేతా మహంతి కార్యాలయంలో మొత్తం 15 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. కలెక్టరేట్‌లో ఇప్పటివరకు మొత్తం15 మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news