సాయి పల్లవి చుట్టూ తిరుగుతున్న మెగామూవీస్

-

మెగామూవీస్‌ సాయి పల్లవి చుట్టే తిరుగుతున్నాయి. ముగ్గురు మెగాహీరోలు ఆమెతో సినిమా చెయ్యడానికి తెగ ట్రై చేస్తున్నారు. మరి ముగ్గురు మెగాహీరోలు ఈ అమ్మడి కోసం ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు?

చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్‌ వరకు మెగా హీరోలు ముగ్గురు సాయి పల్లవితో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. చిరంజీవి ‘వేదళం’ రీమేక్‌లో చెల్లెలి పాత్రకి సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నాడు. అయితే పల్లవి ఇంకా, గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని కొంతమంది, ఓకే చెప్పిందని మరికొంతమంది అంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ మాత్రం రాలేదు.

పవన్‌ కళ్యాణ్, రానా లీడ్‌రోల్స్‌లో సాగర్‌.కె.చంద్ర ఒక సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాడు. మళయాళం హిట్‌ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తోందీ సినిమా. ఇగోవార్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి ఒక హీరోయిన్‌గా నటిస్తుందని చెప్తున్నారు.

అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ ఫుల్‌ రస్టిక్‌ లుక్‌లో కనిపిస్తోన్న సినిమా ‘పుష్ప’. సుకుమార్‌ డైరెక్షన్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. రష్మిక మందన్న చెల్లెలిగా, బన్నిని ఆటపట్టించే మరదలిగా కనిపిస్తుందని చెప్తున్నారు.

సాయిపల్లవికి సూపర్ పెర్ఫామర్‌గా ఇమేజ్‌ ఉంది. పల్లవి స్ట్రాంగ్‌రోల్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా ప్రజెంట్ చేస్తుందని మేకర్స్‌ అంతా నమ్ముతుంటారు. అందుకే మెగాహీరోలు హైబ్రిడ్‌పిల్లని తీసుకోవడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అయితే సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్స్‌లో నటిస్తే, ఆమె కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news