పరుగులు పెడుతున్న పసిడి.. స్థిరంగా వెండి

-

బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. మూడు రోజుల కిందట భారీ తగ్గిన బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. పసిడి పరుగులు తీస్తుండగా.. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.43,870కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.44,870కి చేరింది.

బంగారం-వెండి
బంగారం-వెండి

10 గ్రాములు.. బంగారం ధర..
రాష్ట్రాల వ్యాప్తంగా బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నై పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,310 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,160కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,870 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,870కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,170కి చేరింది. కోల్‌కతా పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,940కి చేరింది. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830 గా ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో హైదరాబాద్‌లో కొనసాగిన ధరలే కొనసాగాయి.

కేజీ.. వెండి ధర..
మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన వెండి ధర నిన్నటి రోజూ భారీగా తగ్గింది. ప్రస్తుతం వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,900, దేశ రాజధాని ఢిల్లీలో కేజీ రూ.66,900, చెన్నైలో రూ.71,400, ముంబైలో రూ.66,900, బెంగళూరులో రూ.66,900, కేరళలో ధర రూ.66,900, విజయవాడలో 71,400, మంగళూరులో రూ.66,900, మైసూరులో రూ.66,900గా ధరలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news