ధూళిపాళ్ళ ఆస్పత్రిలోనే… హైకోర్ట్ కీలక ఆదేశాలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే స్పష్టత లేదు. ఈ నేపధ్యంలో తాజాగా ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ను మే 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని సూచనలు చేసింది. వీరిని డిశ్చార్జ్ చేసే సమయంలో కోర్ట్ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై నివేదికలు సమర్పించాలని కోర్ట్ ఈ సందర్భంగా ఆదేశించింది. ఇక ఆయన బెయిల్ పిటీషన్ హైకోర్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news