జాతీయ వైద్యుల దినోత్సవం.. చంద్రబాబు ప్రశంసలు

-

అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో వైద్యుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రాణోపాయం ఉందని తెలిసి కూడా కరోనా బాధితులకు వైద్యులు అందించిన సేవలు మరువలేనివని చెప్పారు. వైద్యులకు వృత్తి ధర్మంపై ఉన్న అంకితభావం చేస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందన్నారు. రాత్రింబవళ్లు రోగులను కాపాడేందుకు చాలా శ్రమింస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

అయితే వైద్యుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. డాక్టర్లకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం హయాంలో వైద్యులకు ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికైనా వైద్యుల సమస్యలపై ప్రభుత్వం దృష్టించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news