ఇండియాలో ఇవాళ 10,423 కరోనా కేసులు.. 250 రోజుల తర్వాత ఇదే మొదటిసారి !

-

ఇండియాలో కరోనా కేసులు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు ఇవాళ తగ్గిపోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,423 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,60,470 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,53,776 కు చేరింది. 250 రోజుల తర్వాత ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 443 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,58,880 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,021 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,83,581 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,06,85,71,879 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news