సూర్యాపేట, జనగాం లో నేడు బండి సంజయ్ పర్యటన.. నెలకొన్న టెన్షన్

-

ధాన్యం కొనుగోలుకు మద్దతుగా నేడు బండి సంజయ్ సూర్యాపేట, జనగాం జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. రాష్ట్రం ధాన్యం కొనుగోలును వేగం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వారాలు గడిచిన రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని బీజేపీ విమర్శిస్తోంది.

bandi-sanjay

అయితే బండి సంజయ్ నిన్నటి నల్లగొండ పర్యటనలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల బండి సంజయ్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేఖించారు. ఫలితంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట వరకు వెళ్లింది. నల్లగొండ జిల్లా ఆర్జాలబావి వద్ద ఇరు పార్టీలు కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. మరోవైపు బండిసంజయ్ కారుపై టమాటాలు, కోడిగుడ్లతో దాడులు చేశారు. దీంతో పర్యటనను అర్థాంతంరంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. బండి సంజయ్ పర్యటనను రైతులే అడ్డుకున్నారని టీఆర్ఎస్ అంటుంటే.. బీజేపీ మాత్రం రైతుల ముసుగులో టీఆర్ఎస్ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news