బీజేపీ పార్టీకి తీన్మార్‌ మల్లన్న రాజీనామా ?

-

బీజేపీ పార్టీ నేత,ప్రముఖ జర్నలిస్టు తీన్మార్‌ మల్లన్న… టీఆర్‌ఎస్‌ పార్టీపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్యూ న్యూస్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా.. పొద్దున్నే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ను తిట్టడం మొదలెడతారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను.. ప్రజలకు ఎత్తి చూపిస్తారు. అయితే.. ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ తీన్మార్‌ మల్లన్నపై కేసులు పెట్టింది.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

వీటి నుంచి తప్పించుకునేందుకు ఇటీవల బీజేపీ పార్టీలో చేరారు. అయితే.. తీన్మార్‌ మల్లన్న బీజేపీ పార్టీ చేరినప్పటి నుంచి.. బండి సంజయ్‌… మల్లన్నను దూరం పెడుతున్నారు. అయినప్పటికీ.. నిలదొక్కుకున్న తీన్మార్‌ మల్లన్న… బీజేపీ పార్టీలోనే కొనసాగారు.

అయితే… తాజాగా మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పడే ఎన్నికలు జరిగితే… ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని… తీన్మార్‌ మల్లన్న అన్నారు. దీంతో మల్లన్న బీజేపీ పార్టీకి వీడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో తీన్మార్‌ మల్లన్న చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే త్వరలోనే మల్లన్న లక్ష మందితో సభ పెడతారని చెప్పినట్లు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news