పల్నాడు హత్యలపై డిజిపికి లేఖ రాసిన చంద్రబాబు

-

పల్నాడు హత్య రాజకీయాల పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కి చంద్రబాబు లేఖ రాశారు. పల్నాడు జిల్లా సంగమేశ్వర పాడులో టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. వైఎస్ఆర్సీపీ అనుకూల పోలీసు అధికారుల తీరుతో పల్నాడులో శాంతిభద్రతలు గాడి తప్పాయంటూ పేర్కొన్నారు.

2019 ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకర్తల దాడుల భయంతో వేరే ప్రాంతంలో ఉంటున్న జల్లయ్య శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తే దారుణంగా చంపేశారు అన్నారు. ఈ దాడిలో జల్లయ్య ప్రాణాలు కోల్పోగా.. బక్కయ్య, ఎల్లయ్య ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కొద్ది నెలల క్రితం జరిగిన తోట చంద్రయ్య హత్య సమయంలోనే పల్నాడులో పరిస్థితులపై పోలీసుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు వివరించారు. పల్నాడు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిజిపిని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news