తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. 2019 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పుంజుకుంటూ ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపి పార్టీ ముందుకు వెళుతూ ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని… తెలంగాణ గడ్డ చైతన్య వంతమైందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.

తెలంగాణ ప్రజలకు బిజెపి పార్టీపై చాలా నమ్మకం పెరిగిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ. ఈ ఫ్యాక్టరీతో… దేశంలో ఎరువుల కొరత తీరుతుందని చెప్పారు. తెలంగాణలో 5 నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకార అందిస్తోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news