బురద గుంటలో దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వీడియో వైరల్

-

రైల్వే, మున్సిపల్ అధికారులు తీరని నిరసిస్తూ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలో దిగారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మాట్లాడుతూ… 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోందని ఆయన తెలిపారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందని… దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ప్రశ్నించాలని గుర్తు చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రైల్వే అలాగే కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని.. కానీ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news