టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

-

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేష్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నామని వెల్లడించాడు.

IND v WI, 1st ODI: West Indies win toss, elect to bowl first against India, India  vs West Indies ODI, West Indies win toss and elect to bowl first against  India

అవేష్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడని ధావన్ వివరించాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ 6, షాయ్ హోప్ 5 పరుగులతో ఆడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news