పాక్‌ మ్యాచ్‌ గెలిచిన టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..కీలక ప్లేయర్‌ రీ ఎంట్రీ

-

పాక్‌ మ్యాచ్‌ గెలిచిన టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2022 కు ముందు టీమిండియా కు గుడ్ న్యూస్ అందడంతో.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఆసియా కప్ 2022 కు దూరమైన భారత స్టార్ పెసర్ జస్ప్రీత్ బూమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తో జరగనున్న సిరీస్ లతో పాటు టి20 ప్రపంచ కప్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బూమ్రా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజుల పాటు గడిపాడు. అతడు తన గాయం నుంచి కొలుకోవడంతో తిరిగి స్వస్థలం ముంబై కు చేరుకున్నట్లు సమాచారం. కాగా… ఆగస్టు 28వ తేదీ ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టి20 మ్యాచ్ అందరినీ ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news