ఇండియా కొత్తగా 1968 కరోనా కేసులు..133 రోజుల తర్వాత ఇదే తొలిసారి

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,599,466 కు చేరింది. 133 రోజుల తర్వాత ఒక్క రోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 34,598 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7 మంది మాత్రమే మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 528,716కు చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,528 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 44,036,152 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news