దుర్మార్గమైన కేసీఆర్ పాలన పోతేనే ప్రజల బతుకులు బాగుంటాయి : రాజగోపాల్‌ రెడ్డి

-

పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊరా వాడా కలియ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చండూరు మండలం కొండాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి .. తన రాజీనామా దెబ్బకి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ మునుగోడుకు క్యూ కట్టారని చెప్పారు. తనపై మునుగోడు ప్రజలకు ఎనలేని ప్రేమ ఉందని..అందుకే 2018లో గెలిపించారని గుర్తు చేశారు. మునుగోడు ప్రజలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీలో ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Rajagopal Reddy alleges match fixing between TRS, Congress in Munugode  by-polls

సీఎం కేసీఆర్ అధికారం, డబ్బునే నమ్మకున్నారని..తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. శాసనసభలో ప్రశ్నించే గొంతును లేకుండా చేయాలనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దుర్మార్గమైన కేసీఆర్ పాలన పోతేనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ఇక్కడి ఓటర్ల తీర్పుతో తెలంగాణ రాత మారబోతోందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news