త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తాం – మంత్రి హరీష్‌ రావు

-

త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. సిద్దిపేట మల్టీ పర్పస్ హైస్కూల్ లో కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాలు, పండ్లు, ఎగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ యువత కు అగ్నిపత్ పేరుతో ఆర్మీ ఉద్యోగాలు రాకుండా చేసిందని ఫైర్‌ అయ్యారు. యువత జీవితాన్ని నాశనం చేసే విధంగా ఆర్మీలో అగ్నిపత్ పేరుతో కాంటాక్ట్ విధానం తెచ్చిందని మండిపడ్డారు. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తాం.. 95% స్థానికులకే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news