బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తోంది.. సంబరాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

-

గుజరాత్‌ ఎన్నికల్లో 156 స్థానాల్లో బీజేపీ విజయ దుందుభి మ్రోగించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో క్యాడర్ తో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ ప్రజలు బీజేపీ వైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని, ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్ళీ గెలిచామన్నారు. ‘కష్టపడి పనిచేసే బీజేపీ గుజరాత్ కార్యకర్తలు అందరికీ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఛాంపియన్! మా పార్టీకి నిజమైన బలం అయిన మా కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

In PM Modi's presence, Nadda slams Kejriwal on Gujarat: 'Kattar baiman' -  Hindustan Times

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ ‘ధన్యవాదాలు గుజరాత్. అసాధారణ ఎన్నికల ఫలితాలను చూసి నేను చాలా భావోద్వేగాలకు లోనయ్యాను. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారు. అదే సమయంలో ఈ ఊపు మరింత వేగంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. నేను గుజరాత్ జనశక్తికి నమస్కరిస్తున్నాను..’ అని మోదీ తన తదుపరి ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల పనితీరు అన్ని రికార్డులను బద్దలు కొట్టేలా చేసింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక స్థానాలను సాధించిన పార్టీగా బీజేపీ నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news