ఆంధ్ర – తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కెసిఆర్ కాదా? – మహేష్ గౌడ్

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. సీఎం కేసీఆర్ ఎన్నికలు వస్తే పథకాలు.. ఎన్నికలు అయిపోగానే కోతలు పెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా గొర్రెల పంపిణీకి గొల్ల కురుమల అకౌంట్లో నిధులు జమ చేశారని.. ఎన్నికలు అయ్యేవరకు ఆ డబ్బులని ఫ్రీజ్ చేసి ఉంచి మళ్లీ వెనక్కి లాగేసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అయ్యేవరకు ఓ మాట.. అయిన తర్వాత ఇంకో మాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్ళీ అధికారంలోకి ఎలాగైనా రావాలనేదే కెసిఆర్ యావ అంటూ దుయ్యబట్టారు. మంత్రులు వేల కోట్లు వెనకేసుకోవడంలో బిజీగా ఉన్నారని.. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఆంధ్ర నేతలను తిట్టి.. ఇప్పుడు వారినే నెత్తిన పెట్టుకుంటున్నాడని ఆరోపించారు. ఆంధ్ర – తెలంగాణ మధ్య చిచ్చు పెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు మహేష్ గౌడ్. బిజెపి సూచన మేరకే బిఆర్ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news