తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు

-

నిన్న లోకేశ్ యువగళం పాదయాత్రకు హాజరైన నందమూరి తారకరత్న పాదయాత్ర సమయంలో గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.. కాగా వెంటనే బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకుని, నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులను తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారని వెల్లడించారు. వైద్యులతో తాను మాట్లాడానని, తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

Chandrabbau arrives Bengaluru and visit Narayana Hrudayalaya where Tarakaratna being treated

నిన్న లోకేశ్ యువగళం పాదయాత్రకు తారకరత్న వచ్చారని, పాదయాత్ర సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. కుప్పం ఆసుపత్రిలో తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించారని, ఎందుకైనా మంచిదని బెంగళూరు ఆసుపత్రి నుంచి కూడా వైద్యులను రప్పించామని చంద్రబాబు వివరించారు. వైద్యుల సలహాపై మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తీసుకువచ్చినట్టు తెలిపారు. రక్తప్రసరణలో ఇంకా గ్యాప్ లు వస్తున్నాయని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news