తెలంగాణకు రావలసిన 470 కోట్లని ఏపీకి ఇచ్చారు – సీఎం కేసీఆర్

-

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒకటి కూడా రాలేదన్నారు. ఇదే నా ఫెడరల్ వ్యవస్థ? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన రూ. 470 కోట్లు ఏపీకి ఇచ్చారని అన్నారు. మా రాష్ట్రానికి రావలసినవి మాకు ఇవ్వాలని గత ఏడేళ్ల నుంచి అడుగుతున్నామన్నారు.

బయట చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందన్నారు. మాటలు కోటలు దాటుతాయి కానీ.. వెనక్కి తిరిగి చూసుకుంటే మంచినీళ్లు కూడా ఉండవన్నారు. మినిమం బేసిక్స్ నీడ్స్ లేవన్నారు కేసీఆర్. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఢిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, బిజెపి అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని అన్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news