బడ్జెట్ సమావేశాలపై అక్బరుద్దీన్ అసంతృప్తి

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 7 రోజుల నిర్వహించడంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు కనీసం 20 రోజులు నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలా చేసి ఉంటే కనీసం 25 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేసే అవకాశం ఉండేది అన్నారు.

కోవిడ్ కారణంగా గత ఏడాది అసెంబ్లీ సమావేశాలు కుదించారని, ఈసారి కూడా తక్కువ రోజులు నిర్వహించడం సరికాదన్నారు. 2014 – 18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే, 2018 నుంచి ఇప్పటివరకు 67 రోజులు మాత్రమే సభ కొలువుదీరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం క్రియాశీలకంగా ఉండాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ.

Read more RELATED
Recommended to you

Latest news