కీలక మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా మహిళల జట్టు..

-

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు గ్రూప్-బి లో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు రానుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారత జట్టు ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్ లను ఓడించిన భారత్.. రెండ్రోజుల క్రితం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఛేదనలో తడబడి ఓడింది.

దీంతో నేటి మ్యాచ్ లో గెలవడం భారత్ కు అత్యావశ్యకం అయింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఓడటం వల్ల భారత్ కు సెమీస్ గండం పొంచి ఉంది. నేడు ఐర్లాండ్ ఏమైనా షాక్ ఇస్తే అది భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లుతుంది. గ్రూప్ – బి పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి (ఆరు పాయింట్లు) సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news