నాకు ఉరి వేయండి : ఎమ్మెల్యే రాజాసింగ్

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల గురించి మాట్లాడితే జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. జైలు కూడా తనకు ఇల్లు లాంటిదేనని పేర్కొన్నారు. తనకు ఉరివేయాలన్నారు. బ్రతికి ఉంటే హిందువుల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. పోలీసులకు తలనొప్పిగా ఉంటానని వెల్లడించారు.

ఇండియాను హిందూ దేశంగా చేయడం తన కల అని పేర్కొన్నారు. కాగా నిన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది. రాజాసింగ్ పై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపిసి153a1(ఎ) కింద కేసు నమోదు చేశారు. కాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకుగాను హైదరాబాద్ పోలీసులు సైతం రాజాసింగ్ గతంలో నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news