మొయిన్ అలీ: ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కాదు…

-

చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలిపి ఎందరో యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్నాక ఇప్పుడు ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. కానీ గత కొద్ది రోజుల నుండి ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వైరల్ వస్తున్నాయి. అంతేకాకుండా చెన్నైతో ఆడిన కేదార్ జాదవ్ సైతం ఇదే విషయాన్ని చెప్పడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. ఈ విషయంపైన ఎలాగు ధోని అయితే స్పందించలేదు.. కానీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మొయిన్ అలీ స్పందించాడు.. అందరూ అనుకుంటున్నట్లు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

అలీ మాట్లాడుతూ ధోని ఆడుతున్న విధానం చూస్తుంటే తప్పకుండ మరో రెండు సీజన్ లు ఖచ్చితంగా ఆడుతాడని అభిప్రాయపడ్డారు. ఈ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ధోని కి ఇది చివరి ఐపీఎల్ కాదు అన్న విషయం మాత్రం క్లియర్ అవుతోంది. మరి చూద్దాం ఇంకెంతకాలం ధోని ఐపీఎల్ లో కంటిన్యూ అవుతాడో ?

Read more RELATED
Recommended to you

Latest news