రూ.200తో ప్రతి నెల దినపత్రిక కొనాలి : రెండు జీవోలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

-

రూ.200తో ప్రతి నెల దినపత్రిక కొనాలని ఏపీ ప్రభుత్వం రెండు జీవోలు ఇచ్చింది. దీనిపై ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏపీలో వాలంటీర్లు దినపత్రిక కొనుగోలు చేయాలన్న జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Supreme Court takes up hearing on Ushodya Publications petition

వాదనల సందర్భంగా… ఏపీ హైకోర్టులో విచారణకు సిద్ధమని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తే ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని వాదించారు. అందుకు సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ…. అలాంటి తేలికపాటి అభిప్రాయానికి తావులేకుండానే ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కేసు విచారణ అర్హతల విషయంలోకి వెళ్లడంలేదని తెలిపింది. కేసుపై తుది విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టుకు సూచిస్తున్నట్టు వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news