అస్సాం సీఎం: 100 సంవత్సరాలు కాంగ్రెస్ గెలవదు.. !

-

కర్ణాటక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం మే 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 12 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంకో 8 రోజుల్లో ఎన్నికలు ఉండగా… బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ రోజు ఒరిస్సా సీఎం హిమంత బిస్వ బీజేపీకి మద్దతుగా తుమకూరు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మరో 100 యేళ్లు వరకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అన్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం గెలుపు అన్న విషయాన్ని మరిచిపోవాలన్నారు.

తుమకూరు లో చాలా గ్రామాలలో కనీస అవసరాలు రోడ్లు మరియు నీటి వసతి కూడా లేవు, ఇలా మారడానికి కారణం గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అన్నారు. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి మరి అవకాశం ఇస్తారా లేదా కాంగ్రెస్ కూటమికి పగ్గాలు అందిస్తారా చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news