జగన్ ప్రభుత్వం స్పష్టమైన హామీతో ఉద్యమాన్ని విరమిస్తున్నాం… : బొప్పరాజు

-

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కాసేపటి క్రితమే ఉద్యోగుల హక్కుల కోసం చేస్తున్న అలుపెరుగని 92 రోజుల పోరాటాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. ఈయన మాట్లాడుతూ మేము ప్రభుత్వాన్ని దేనికోసం అయితే అడుగుతూ వచ్చామో ఆ విషయం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నెరవేరుస్తాము అని చెప్పడంతోనే మేము ఈ సమ్మెను ఆపివేస్తునట్లు ప్రకటిస్తున్నామని చెప్పాడు. ఇంతకు ముందు నుండి మేము అడుగుతున్న పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాము అన్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బొప్పరాజు. మేము చేసిన ఈ పోరాటంలో ప్రభుత్వం నుండి 37 డిమాండ్లు సక్సెస్ ఫుల్ గా సాధించుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

ఇక నుండి అయినా ప్రభుత్వం మళ్ళీ చలో విజయవాడ చేసే అవకాశం ఇవ్వకుండా పాలన సాగించాలని కోరుకుంటున్నాం అన్నారు బొప్పరాజు.

Read more RELATED
Recommended to you

Latest news