త్వరలోనే తాడేపల్లి వేదికలో టీడీపీలో చేరుతా – ఆనం రామనారాయణ రెడ్డి

-

త్వరలోనే తాడేపల్లి వేదికలో టీడీపీలో చేరుతానంటూ వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వెంకటగిరి వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో టిడిపి నేతల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… నారా లోకేష్ పాదయాత్ర పై చర్చించామని.. నిన్న చంద్రబాబుతో భేటీ అయ్యానని వెల్లడించారు.

అన్ని విషయాలు చర్చించానని… త్వరలోనే తాడేపల్లి లోని టిడిపి కార్యాలయంలో అనుచరులతో కలిసి పార్టీలో చేరుతామని చెప్పామని వెల్లడించారు. పాదయాత్రను విజయవంతం చేస్తామని వివరించారు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ… లోకేష్ పాదయాత్ర రాయలసీమ లో విజయవంతమైందని… కడపలో బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు.
13 న నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం లో మొదలవుతుందని…జిల్లాలో నెల రోజులు జరుగుతుందన్నారు. ఒకో నియోజకవర్గం లో 3 రోజులు ఉంటుందని.. రాయల సీమ కంటే నెల్లూరు లో విజయవంతమౌతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news