ఐదో అంతస్తు నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్

-

హైదరాబాద్​లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్​లో చేరిన వారం రోజుల్లోనే ఆ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హాస్టల్​లో ఉండటం ఇష్టం లేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. బాచుపల్లిలోని నారాయణ కాలేజ్‌ హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వంశిక అనే విద్యార్థిని హాస్టల్‌ ఐదో అంతస్తు నుంచి దూకింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీఐ సుమన్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి పట్టణనికి చెందిన ఆర్‌.వంశిక (16)ను వారం క్రితమే తల్లిదండ్రులు హస్టల్‌లో చేర్పించి వెళ్లారు. మంగళవారం ఉదయం ఆమె భవనంపై నుంచి కింద పడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన సహ విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news