అంబటి రాంబాబుపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు విమర్శలు

-

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రపై వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పవన్ గురించి కానీ, వారాహి యాత్ర గురించి కానీ విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అంబటి నీటిపారుదల మంత్రి కాదని, నోటిపారుదల మంత్రి అని విమర్శించారు గాదె వెంకటేశ్వరరావు.

Janasena: అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి - OK Telugu

తన అవినీతిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు అంబటి ఇంతవరకు సమాధానం చెప్పలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో అంబటిపై జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. నీటిపారుదల శాఖకు అంబటి న్యాయం చేయలేదని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీలో సీనియర్ గా కనిపించేందుకే జుట్టుకు అంబటి రంగు వేయడం లేదని చెప్పారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news