తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు – ఎమ్మెల్సీ పల్లా

-

వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము అవినీతి చేశామని ప్రధాని మోదీ అంటున్నారు.. మరి దర్యాప్తు సంస్థలు అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా..? ఏం చేస్తున్నారు మీరు అని ఆయన ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపికి ఒక అసెంబ్లీ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు పల్లా. వేట కుక్కల్లా వెంటపడినా మా దగ్గర ఏమీ లేదని తేలిందని అన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత వరుసగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక బండి సంజయ్ పేపర్ లీక్ చేస్తే వరంగల్ పోలీసులు జైల్లో పెట్టారని.. గుజరాత్ లో ఒక్క పరీక్ష కూడా పెట్టలేని పరిస్థితులలో బిజెపి సర్కారు ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news