పవన్ కళ్యాణ్‌తో నిన్న ఉన్నాం.. మొన్న ఉన్నాం..రేపు ఉంటాం – బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి

-

పవన్ కళ్యాణ్‌తో నిన్న ఉన్నాం.. మొన్న ఉన్నాం.. రేపు ఉంటామని ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు పురంధేశ్వరి. ఈ సందర్భంగా పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు సోము వీర్రాజు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ… బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ.. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నా మీద నమ్మకం విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు ధన్యవాదాలు అన్నారు.

ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలు కంటే ఎక్కువ మేలు కేంద్రం చేస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల మేళ్లన్ని ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నామని.. పవన్ కళ్యాణుతో నిన్న ఉన్నాం.. మొన్న ఉన్నాం.. రేపూ ఉంటామని ప్రకటించారు. పోలవరం నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదని.. నిర్వాసితులపై క్లారిటీ వస్తే కేంద్రం దృష్టి సారిస్తుందన్నారు. పొత్తులు పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. జనసేనతో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news