జగన్ సోలో ఫైట్..బాబు-పవన్‌కు యాంటీ.!

-

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఒక్కరే ఒంటరిగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈయనపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పి, సి‌పి‌ఐ, కాంగ్రెస్..ఇలా అన్నీ పార్టీలు జగన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయి. రాజకీయం నడిపిస్తున్నాయి. చంద్రబాబు ఎలాగో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి..ప్రతి అంశంపై విమర్శలు చేయడమే. ప్రజలకు మంచి జరిగే పనులపై కూడా విమర్శలే.

jagan chandrababu pawan

అటు పవన్ మొన్నటివరకు అప్పుడప్పుడు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఇప్పుడు ఏపీలోనే ఉంటూ వారాహి యాత్ర చేస్తూ ప్రత్యేకంగా జగన్‌ని తిట్టడానికే ఉన్నట్లు ఉన్నారు. ఇక కొత్తగా ఏపీ బి‌జే‌పి అధ్యక్షురాలు అయిన పురందేశ్వరి సైతం జగన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అంటే టి‌డి‌పి-జనసేనలతో బి‌జే‌పి పొత్తు నేపథ్యంలో విమర్శల దాడి పెంచారు. ఇక పనిలో పనిగా సి‌పి‌ఐ, కాంగ్రెస్‌లు కూడా జగన్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నాయి. ఇలా ప్రతి పార్టీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

కానీ జగన్ మాత్రం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి..ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇక ఒంటరిగానే ఆయన పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రజలకు చేసిన మంచినే ఆయన నమ్ముకున్నారు. ఇక బాబు, పవన్ ఎన్ని కుట్ర రాజకీయాలు చేసిన జగన్‌కు ప్రజలు మద్ధతు ఉందని చెప్పవచ్చు.

ఇలా మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల బాబు, పవన్‌పైనే వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పవచ్చు. దీని వల్ల జగన్‌కు మేలు జరుగుతుంది. కాబట్టి బాబు-పవన్ కలిస్తేనే జగన్‌కు ప్లస్.

Read more RELATED
Recommended to you

Latest news