చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన ఎన్నికల స్టంట్ – ఎమ్మెల్యే కాటసాని

-

కర్నూలు: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన ఎన్నికల స్టంట్ అని అన్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసింది శూన్యం అన్నారు. చంద్రబాబుకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడానికి కొన్ని పనులు చేశారని ఆరోపించారు.

జగనన్న బటన్ నొక్కి డబ్బులు ఇస్తూ ఏపీని మరో శ్రీలంక చేస్తున్నాడని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. టిడిపి మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది చదివినా అందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారని.. చంద్రబాబు అప్పుడొక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news