రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన..

-

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పర్యటించగా.. రేపు రెండో రోజు జగన్ పర్యటన ఉండనుంది. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్‌ బయలుదేరనున్నారు.

Cooperative Banking Growth Story Began Four Years Ago In AP: CM Jagan

ఉదయం 10 గంటలకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపు లంకకు సీఎం చేరుకోనున్నారు. వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం రామాలయంపేట గ్రామం తానేలంకకు సీఎం జగన్ చేరుకోనున్నారు. అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేటలో బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. వారి గోడును తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news